వైసీపీ కీలక నేతతో ఆర్జీవీ మంతనాలు!

by Anil Sikha |
వైసీపీ కీలక నేతతో ఆర్జీవీ మంతనాలు!
X

దిశ, డైనమిక్​బ్యూరో : ప్రకాశం జిల్లా మద్దాపాడు మండలం వెల్లంపల్లిలో ఈ రోజు ఉదయం రాంగోపాల్​వర్మను మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి కలిశారు. ఓ హోటల్​లో వీరిద్దరూ మంతనాలు సాగించారు. ఇవాళ్ల ఒంగోలు రూరల్​పోలీస్​స్టేషన్​లో ఆర్జీవీ విచారణకు హాజరుకావలసి ఉంది. గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి రాంగోపాల్ వర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయనకు రెండు సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు. కొద్దిరోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లారని కూడా వదంతులు వినిపించాయి. అదేం లేదంటూ తాను అందుబాటులోనే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఆ తర్వాత ఆయన హైకోర్టులో ముందస్తు బెయిలు పొందారు. ఆ సమయంలో కోర్టు ఇచ్చిన సూచనల మేరకు ఆయన విచారణకు హాజరు కావలసి ఉంది. ఈ రోజు ఆయన ఒంగోలు చేరుకోవాల్సి ఉండగా.. మార్గ మధ్యలో వైసీపీ కీలకనేతతో భేటీ కావడం ఫ్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement
Next Story