- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajya Sabha: అమరావతికి చట్టబద్ధత బిల్లు.. ఓవర్ టు ‘రాజ్యసభ’
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభలో ఆమోదం తర్వాత రాజ్యసభకు చేరింది.

దిశ, వెబ్డెస్క్: అమరావతి (Amaravati)ని శాశ్వత రాజధానిగా గుర్తించే ప్రక్రియ తుది దశకు చేరింది. లోక్సభ (Lok Sabha) లో ఇవాళ జరిగిన చర్చ అనంతరం ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మేరకు ఆ బిల్లు రాజ్యసభకు అందినట్లుగా సెక్రటరీ జనరల్ అధికారికంగా ప్రకటించారు. రేపు ఉదయం రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ (Nityanand Rai) ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు అమరావతికి చట్టబద్ధత బిల్లుపై చర్చ ప్రారంభం కానుంది. సుమారు ఒక గంట పాటు ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే, జూన్ 2, 2024 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఈ బిల్లు చట్టబద్ధంగా గుర్తిస్తుంది. గతంలో వినిపించిన మూడు రాజధానుల ప్రతిపాదనలకు తావు లేకుండా, భవిష్యత్తులో ఎవరూ రాజధానిని మార్చలేని విధంగా ఉభయ సభల్లో బిల్లు ఆమోదం తర్వాత సెక్షన్-5కు సవరణలు చేయనున్నారు.
కాగా, ఈ బిల్లుకు అటు అధికార ఎన్డీయే (NDA)తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా లోక్సభలో మద్దతు తెలపడం విశేషం. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మాత్రం లోక్సభలో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసింది. రేపు రాజ్యసభలో కూడా అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం అవ్వగానే గెజిట్ విడుదల తర్వాత అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభించనుంది.






