పురంధేశ్వరీ! ఆ ప్రశ్నకు‘మా బావ కళ్లల్లో ఆనందం కోసం’అని నిజం చెబుతారా?: ఎంపీ విజయసాయిరెడ్డి

by Disha Web Desk 21 |
పురంధేశ్వరీ! ఆ ప్రశ్నకు‘మా బావ కళ్లల్లో ఆనందం కోసం’అని నిజం చెబుతారా?: ఎంపీ విజయసాయిరెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శల దాడి మరింత పెంచారు. తాజాగా బుధవారం పురంధేశ్వరిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు జాతీయ నేతగా ఉన్న పురంధేశ్వరి నేడు జాతినేతగా మారిపోయారని ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అంతేకాదు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పురంధేశ్వరి సొంత జిల్లాలో బీజేపీ అభ్యర్థులను ఎందుకు బరిలోకి దించలేదు అని విజయసాయిరెడ్డి నిలదీశారు.‘చెల్లీ! చిన్నమ్మా పురంధేశ్వరి! మీరు 'జాతీయ నేత'గా ఉండి 'జాతి నేత'గా ఎందుకు మారారు?’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘మీ సొంత ఊరు ప్రకాశం జిల్లా కారంచేడులో మీరు ఇప్పుడున్న బీజేపీ నుంచి గత ఎన్నికల్లో సర్పంచ్ లేదా మీ సొంత మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఎందుకు పోటీకి పెట్టలేదు.ఆ సమయంలో మీరు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కదా’ అని గుర్తు చేసి మరీ దెప్పి పొడిచారు విజయసాయిరెడ్డి. ‘రాష్ట్రంలో మీ పార్టీలో ఉన్న చిన్నచిన్న నేతలు కూడా ఎంతో నిజాయితీగా అన్ని చోట్ల పోటీచేశారు... ఆ పని మీరెందుకు చేయలేకపోయారు. మీ పార్టీ కార్యకర్తలు ఈ ప్రశ్న అడిగితే మీరేం సమాధానం చెపుతారు’ కొంపదీసి‘మా బావ కళ్లల్లో ఆనందం కోసం’అని నిజం చెబుతారా? అని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇదేనా మీకు మీ పార్టీపై ఉన్న చిత్తశుద్ధి.వెనకటికి ఒకామె... ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అన్నదట’ అలా ఉంది మీ వ్యవహారం అంటూ విజయసాయిరెడ్డి పురంధేశ్వరిపై సెటైర్లు వేశారు.



Next Story

Most Viewed