Ap: పీఎస్ఆర్ ఆంజనేయులకు బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ మంజూరు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-11 13:33:57  IST  )

పీఎస్ఆర్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది....

Ap: పీఎస్ఆర్ ఆంజనేయులకు బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీపీఎస్సీ కేసు(APPSC case)లో పీఎస్ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu)కు భారీ ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు(HighCourt) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హైబీపీ, గుండె సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కోర్టు సమర్పించారు.ఈ కారణాలతో పీఆర్ఎస్ ఆంజనేయులకు 14 రోజుల పాటు మధ్యంతర బెయిల్(Interim Bail) మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం పీఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించనున్నారు.

కాగా జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీకి జరిగిన పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన్ను కొద్దిరోజులక్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టడంతో రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన జైలులో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మధ్యన అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు సిబ్బంది విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు ఇచ్చిన రిపోర్టులతో పీఆఎస్ఆర్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు..పీఎస్ఆర్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.

Next Story