AP: మంటల్లో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

by velandi.Saikiran |   (  Updated:2026-01-07 04:45:49  IST  )

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో అర్ధరాత్రి ఈ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న ఆర్ఆర్ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు, కిందికి దిగినట్లు తెలుస్తోంది. ఈ త‌రుణంలోనే పెను ప్రమాదమే తప్పిందట.

AP: మంటల్లో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఏపీలో రోజుకో పెను ప్రమాదం చోటు చేసుకుంటుంది. పొద్దున లేస్తే చాలు, ఎలాంటి వార్త వింటామో అని జనాలు వణికిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీలో మరో పెను ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు మంటల్లో దగ్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో అర్ధరాత్రి ఈ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న ఆర్ఆర్ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు, కిందికి దిగినట్లు తెలుస్తోంది. ఈ త‌రుణంలోనే పెను ప్రమాదమే తప్పిందట. ఇక ఈ ప్రమాద సంఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రంగంలోకి దిగారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవల కాలంలోనే కర్నూలు బస్సు ప్రమాదంలో ఏకంగా 19 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Read More..

ఏపీ బస్సు ప్రమాదం..డ్రైవర్ అప్రమత్తతో 10 మంది సేఫ్..!

Next Story