తిరుమల శ్రీవారిని దర్శించుకున్న President Murmu

by Sathputhe Rajesh |   (  Updated:2022-12-05 07:35:26  IST  )

తిరుమల శ్రీవారిని సోమవారం రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న President Murmu
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని సోమవారం రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను, వెంకటేశుని చిత్రపటాన్ని రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి వెంట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి రోజా తదితరులు ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఏపీకి వచ్చారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో భేటి కానున్నారు. కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఢిల్లీ పయనమవుతారు.


Read More.......

JP Nadda టూర్ ఖరారు.. టీఆర్ఎస్ కు షాక్ తప్పదా?

Next Story