Ycp నేత హత్య..13 మందికి యావజ్జీవ జైలు శిక్ష

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-10 09:56:21  IST  )

వైసీపీ నేత కంచర్ల శ్రీనివాసుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 13 మంది నిందితులకు ధర్మాసనం యావజ్జీవ జైలు శిక్ష విధించింది. పాత కక్షలతో 2017లో కంచర్ల శ్రీనివాసులు మార్కాపురం జిల్లా పొదిలి మండలం రాజుపాలెంలో హత్యకు గురయ్యారు...

Ycp నేత హత్య..13 మందికి యావజ్జీవ జైలు శిక్ష
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత కంచర్ల శ్రీనివాసుల హత్య కేసు(YCP leader Kancharla Srinivasulu Murder Case)లో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 13 మంది నిందితులకు ధర్మాసనం 13 మంది నిందితులకు యావజ్జీవ జైలు శిక్ష విధించింది. పాత కక్షలతో 2017లో కంచర్ల శ్రీనివాసులు మార్కాపురం జిల్లా పొదిలి మండలం రాజుపాలెంలో హత్యకు గురయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు 13 మంది నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం వారంతా బెయిల్‌పై విడుదలయ్యారు. పలుమార్లు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు వాయిదాలు వేస్తూ వచ్చింది. తాజాగా నేరం రుజువు కావడంతో బుధవారం తుది తీర్పు వెల్లడించింది. దీంతో నిందితులను కోర్టులో నుంచి జైలుకు తరలించారు.

Next Story