- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Ap News: మంత్రిగారు.. మంచి నీళ్లు లేవు
by Disha Web Desk 16 |
X
దిశ, ఎర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలం సి.కొత్తపల్లిలో వారం రోజులుగా మంచి నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని మంచినీళ్ళ ట్యాంకర్లు, ట్రాక్టర్ల యజమానులు మంచి నీళ్లు సరఫరా చేయడం నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు, మహిళలు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై టైర్లు తగులబెట్టి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వారం రోజులుగా మంచినీళ్లు దొరకడం లేదని.. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. దాహంతో పశువులు చనిపోతుంటే పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. మంచినీటి సమస్య తీరుస్తానని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఓట్లు వేయించుకున్నారని.. తీరా గెలిచిన తర్వాత పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా మంత్రి సురేశ్ స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు
Next Story