Ongole: వైసీపీలో తారా స్థాయికి వర్గ విభేదాలు.. ఎమ్మెల్యే బాలినేని సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Ongole: వైసీపీలో తారా స్థాయికి వర్గ విభేదాలు.. ఎమ్మెల్యే బాలినేని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఒంగోలు నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలినేని ఇటీవల వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత సీఎం జగన్ స్వయంగా పిలిచి మాట్లాడారు. అప్పటి నుంచి సైలెంట్ ఉన్న బాలినేని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినవాళ్లే తనను అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. కార్యకర్తల కోసం ఎవరినైనా ఎదిరించేందుకు సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. సీఎం జగన్‌ను తప్ప ఎవరినీ లెక్క చేయనని చెప్పారు. ఒంగోలులోనే రాజకీయం ప్రారంభించానని, అక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బాలినేని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed