సీఎం జగన్ మొనగాడు.. చంద్రబాబు మోసగాడు: మంత్రి అంబటి

by Disha Web Desk 16 |
సీఎం జగన్ మొనగాడు.. చంద్రబాబు మోసగాడు: మంత్రి అంబటి
X

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ కొనసాగుతోంది. ఈ సభకు మంత్రులతో పాటు వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు రా కదిలిరా అంటే ఎవరూ రాలేదని తెలిపారు. సీఎం జగన్ మొనగాడు.. చంద్రబాబు మోసగాడని విమర్శించారు. ఎంతమందితో వచ్చిన చంద్రబాబు ఓటమి తప్పదని అంబటి రాంబాబు హెచ్చరించారు. ఎలాంటి వివక్ష లేకుండా సీఎం జగన్ పారదర్శక పాలన చేస్తున్నారని చెప్పారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలంతా అంటున్నారని తెలిపారు. టీడీపీ-జనసేన సభ జెండా కాదని.. జెండా ఎత్తేసే సభ అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ‘టీడీపీ, జనసేన ఊహించిందే. పవన్ సీఎం కావాలని కాపులు ఎదురు చూశారు. కానీ చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారు. 50 శాతానికి పైగా ప్రజలు సీఎం జగన్ వెంట ఉన్నారు.’ అని అంబటి వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed