కాసానికి మద్దతుగా గచ్చిబౌలి డివిజన్ లో ఎమ్మెల్యే గాంధీ ప్రచారం

by Disha Web Desk 11 |
కాసానికి మద్దతుగా గచ్చిబౌలి డివిజన్ లో ఎమ్మెల్యే గాంధీ ప్రచారం
X

దిశ, శేరిలింగంపల్లి : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా సోమవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీ, సాయి ఐశ్వర్య కాలనీ, ఖాజాగూడతో పాటు పలు కాలనీలలో మాజీ కార్పొరేటర్ సాయిబాబా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటిటి ప్రచారం నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ ఎస్ అభ్యర్థి కాసానికి మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని, కాసానిని అఖండ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇస్తామని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని, ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుందని, కేసీఆర్ పాలనను ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయలేదని ప్రజలకు వివరిస్తూ, మోసం చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని, ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటూ, కాపాడుకుంటూ వచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిత్యవసర సరుకులు, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల బ్రతుకులపై గుది బండగా మారిందని, మత రాజకీయాలు చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని ఎమ్మెల్యే గాంధీ విమర్శించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటువేసి గెలిపించాలని ఎమ్మెల్యే గాంధీ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తీ కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story