కాన్వాయ్‌ను ఆపి రోడ్డుపక్కన బజ్జీలు తీన్న కేసీఆర్.. ఫోటోలు వైరల్

by Disha Web Desk 12 |
కాన్వాయ్‌ను ఆపి రోడ్డుపక్కన బజ్జీలు తీన్న కేసీఆర్.. ఫోటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా బస్సు యాత్రను ప్రారంభించిన ఆయన.. ఈ రోజు సాయంత్రం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో నిర్వహించే రోడ్ షో కు బయలు దేరారు. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తుండగా మార్గమధ్యంలో ఎల్లంపేట స్టేజ్ తండా వద్ద ఓ హోటల్ లో కాసేపు ఆగారు. అలాగే అక్కడే టీ తాగి.. బజ్జీలు తిన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తమ ప్రాంతంలో ఆగారని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం కోలాహలంగా మారిపోయింది. దీంతో కేసీఆర్ వారితో మాట్లాడారు. ఎప్పుడు భారీ బందోబస్తుతో ఉండో కేసీఆర్ ఇలా రోడ్డు పక్కన హోటల్ కనిపించడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Next Story

Most Viewed