Anna Rambabu: ప్రచారంలో ముందంజ

by Disha Web Desk 16 |
Anna Rambabu: ప్రచారంలో ముందంజ
X

దిశా మార్కాపురం: మార్కాపురం నియోజకవర్గ వైసిపి అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు ప్రచారంలో ముందంజలో ఉన్నారు. తమ సామాజిక వర్గం నేతలతో ఒకసారి వ్యక్తిగతంగా ప్రచారం చేశారు. పొదిలి, మార్కాపురంలో తమ సామాజిక వర్గ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అక్కడ ద్వితీయ శ్రేణి నాయకులతో తనకు మద్దతు ఇవ్వవలసిందిగా తన అభ్యర్థిత్వాన్ని బలపరచవలసిందిగా ఆయన కోరారు. ఇది గాక గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఉన్న కుందూరు నాగార్జున రెడ్డికి మద్దతు ప్రకటిస్తూ గిద్దలూరు, కంభం గ్రామాలలో ఆయన పర్యటించి తన అనుచరులకు దిశ నిర్దేశం చేశారు. మండలాల్లో అలాగే మార్కాపురం తర్లపాడు కొనకలమిట్ల, పొదిలి, పెద్దారవీడు మండలాలలో తనదైన శైలితో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ తనకు మద్దతు ఇవ్వవలసిందిగా ప్రచారం సాగిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలని కలుపుకొని పోతున్నారు. దీనితో అన్నా రాంబాబు విజయం తధ్యమని నియోజకవర్గంలోని పరిశీలకులు భావిస్తున్నారు.

కలిసి వచ్చిన ప్రాజెక్టు

మార్కాపురం నియోజకవర్గం వైసిపి అభ్యర్థి అన్నా రాంబాబు విజయం తధ్యమని ఇందుకు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కలసి వచ్చిందని రైతులు భావిస్తున్నారు. ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలకు సాగు త్రాగునీరు అందించుటకు ఏర్పాటు చేసిన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం అన్నా రాంబాబుకి జిల్లాలో ఉన్న వైసీపీ అభ్యర్థులకు ఎంతగానో కలిసి వస్తుందని రాజకీయ నాయకులు మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్టు 2004లో అప్పటి ముఖ్య మంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన విషయము విధితమే కాగా ఈ ప్రాంతంలో ఈ నెల ఆరో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు. దీంతో రైతన్నలు ఆనందోత్సవాలతో ఉన్నారు తమ ప్రాంతం పైరు పంటలతో సస్యశ్యామలం అవుతుందని భూమి విలువ పెరుగుతుందని ప్రజలు అంటున్నారు కనుక ఈ అంశం జిల్లాలో గిద్దలూరు మార్కాపురం కనిగిరి కందుకూరు నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థుల గెలుపుకు ఎంతగానో ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు మేధావులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed