AP Govt: ఆమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం

by Gantepaka Srikanth |   (  Updated:2024-10-27 14:55:33  IST  )

తెలంగాణ నుంచి ఇటీవల ఏపీకి బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల(IAS officers)కు ఏపీ ప్రభుత్వం(AP Govt) కీలక బాధ్యతలు అప్పగించింది.

AP Govt: ఆమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నుంచి ఇటీవల ఏపీకి బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల(IAS officers)కు ఏపీ ప్రభుత్వం(AP Govt) కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి(Amrapali)కి పోస్టింగ్, టూరిజం అథారిటీ CEOగా అదనపు బాధ్యతలు కేటాయించారు. అంతేకాదు.. కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్, వైద్యారోగ్య శాఖ కమిషనర్‌గా వాకాణి కరుణ, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణిమోహన్‌‌కు బాధ్యతలు అప్పగించారు. కాగా, డీఓపీటీ(DOPT) ఆదేశాల మేరకు ఇటీవలే ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులు రిపోర్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు ఆమ్రపాలి(Amrapali), రొనాల్డ్ రోస్(Ronald Rose), వాకాటి కరుణ(Vakati Karuna), వాణిప్రసాద్(Vani Prasad) రిపోర్టు చేశారు. మరోవైపు ఏపీ నుంచి రిలీవ్ అయిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ సీఎస్ శాంతికుమారి(Telangana CS Shanti Kumari)కి రిపోర్ట్ చేశారు. అంతకుముందు ఏపీకి వెళ్లేందుకు నలుగురు అధికారులూ నిరాకరించారు. తెలంగాణలోనే కొనసాగేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. చివరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఏపీలో రిపోర్టు చేశారు.

Next Story