- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డోన్ హైవేపై దొంగల బీభత్సం.. పోలీసుల కాల్పులు
by Naga Rani Yarlagadda |
నంద్యాల జిల్లా డోన్ హైవేపై గురువారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు.

X
దిశ, వెబ్డెస్క్: నంద్యాల జిల్లా డోన్ హైవేపై గురువారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. పందుల లోడ్ తో వెళ్తున్న వాహనాన్ని గుర్తించి ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా.. దుండగులు ఎదురు తిరిగారు. వాహనాన్ని ఆపకుండా ఓవర్ స్పీడ్ తో వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని వెంబడిస్తూనే హైవే పెట్రోలింగ్ పోలీసులకు సమాచారమిచ్చారు. పందుల వాహనాన్ని అడ్డుకునేందుకు పెట్రోలింగ్ పోలీసులు యత్నించగా.. పోలీసులపై, వాహనంపై రాళ్లు, సీసాలు విసిరి దాడిచేశారు. ఇక చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు దొంగలపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో హైవే పెట్రోలింగ్ వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. దుండగులు పోలీసులకు చిక్కకుండా పరారవ్వగా.. ప్యాపిలి వద్ద అడ్డుకునేందుకు మరోసారి ట్రై చేశారు. అక్కడి నుంచి కూడా దొంగలు తప్పించుకుని పారిపోయారు.
Next Story






