పేలుళ్ల కుట్ర భగ్నం కేసు: నిందితులకు వారం పాటు కస్టడీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-22 14:37:00  IST  )

పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో పోలీసులు దూకుడు పెంచారు..

పేలుళ్ల కుట్ర భగ్నం కేసు: నిందితులకు వారం పాటు కస్టడీ
X

దిశ, వెబ్ డెస్క్: పేలుళ్ల(Blasts)కు కుట్ర చేసిన కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మరింతగా విచారించేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. ఈ మేరకు ఏ1 సిరాజ్, ఏ2 సమీర్‌ను వారంరోజులపాటు కస్టడీకీ తీసుకుని విజయనగరం(Vizianagaram)లో విచారించనున్నారు. విశాఖ సెంట్రల్ జైలు(Visakha Central Jail) నుంచి సిరాజ్, సమీర్‌ను శుక్రవారం విజయనగరం తరలించనున్నారు. ఇక వీరిని కస్డడీకి కోరిన నేపథ్యంలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించొద్దని కోర్టు ఆదేశించింది. అంతేకాదు నిందితులకు వైద్యపరీక్షలు చేసి విచారించాలని సూచించింది. కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. దీంతో పేలుళ్ల కుట్రకేసులో కస్టడీ విచారణ కీలకంగా మారనుంది.

Next Story