ఒడిశా టూ కాకినాడ: గంజాయి ముఠా గుట్టురట్టు.. రూ. 50 లక్షల సరుకు సీజ్

by Vemula.Srinu Prasad |

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలో పోలీసులు భారీ గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాకు అందిన ముందస్తు సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు..

ఒడిశా టూ కాకినాడ: గంజాయి ముఠా గుట్టురట్టు.. రూ. 50 లక్షల సరుకు సీజ్
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalle District) నర్సీపట్నం పరిధి(Narsipatnam area)లో పోలీసులు భారీ గంజాయి(Marijuana) స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా(SP Tuhin Sinha)కు అందిన ముందస్తు సమాచారంతో అలర్ట్ అయిన పోలీసులు.. కేడీపేట సమీపంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒడిశా నుంచి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్‌లో సుమారు రూ. 50 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ఆపరేషన్‌లో భాగంగా గంజాయి తరలింపుకు వినియోగిస్తున్న ఒక కారు, మూడు బైకులు మరియు ఐదు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఐదుగురు నిందితుల అరెస్ట్

ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న కాకినాడకు చెందిన తేజ్ కిరణ్, చందు, సింహాద్రి, అరవింద్, విగ్నేష్ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్‌తో సరిహద్దులు దాటిస్తున్న ఈ ముఠాను రూరల్ సీఐ రేవతమ్మ బృందం చాకచక్యంగా పట్టుకుంది. నిందితులపై కేసు నమోదు చేసి, వారిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Next Story