సింపతీ కోసమే పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు : వైవీ సుబ్బారెడ్డి

by Disha Web Desk 21 |
YV Subbareddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల పొత్తులపై వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు జైలుపాలవ్వడంతో పవన్ కల్యాణ్‌ సింపతికోసం పొత్తులు పెట్టుకున్నాడు అని ఆరోపించారు. అవినీతి కేసులో అరెస్ట్ అయి జైలుపాలైన చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు తప్పుచేసిన వ్యక్తికి ఏవిధంగా సపోర్ట్ చేస్తారు..? అని నిలదీశారు. మరోవైపు పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రపైనా తీవ్ర విమర్శలు చేశారు. వారాహి యాత్రలో ఏపీ ప్రభుత్వం, వైసీపీపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను ఖండించారు. పవన్ కల్యాణ్ ఆరోపణలు, విమర్శలు సరికాదన్నారు. ఇదిలా ఉంటే విశాఖ రాజధానిపై క్లారిటీ ఇచ్చేశారు. విశాఖ నుంచే సీఎం వైఎస్ జగన్ పరిపాలన అందిస్తారని వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.



Next Story

Most Viewed