పవన్ కల్యాణ్‌ను కలిసిన కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు

by Disha Web Desk 2 |
పవన్ కల్యాణ్‌ను కలిసిన కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య కలిశారు. గురువారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తాజా రాజకీయాలపై చర్చ జరిగింది. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పక విజయం సాధించాలని హరిరామ జోగయ్య ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ను ఢీ కొని అధికారంలోకి రావాలంటే అనుసరించాల్సిన వ్యూహాలను, ప్రవేశపెట్టాల్సిన పథకాలను పవన్ కల్యాణ్‌కు సూచించారు. జగన్‌ మరోసారి అధికారం చేపట్టడమే ధ్యేయంగా నవరత్నాలు పేర కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలపైనే ఆధారపడిన మాట వాస్తవమేనని అన్నారు. సంక్షేమాన్ని సంక్షేమంతోనే కొట్టాలని సూచించారు.

Next Story

Most Viewed