పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర.. పోస్టర్ రిలీజ్

by Disha Web Desk 21 |
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర.. పోస్టర్ రిలీజ్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఈనెల 14 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ వారాహి యాత్ర పోస్టర్ రిలీజ్ చేశారు. 12 నియాజకవర్గాల్లో 19 మంది సమన్వయకర్తలను నియామకం చేశారు. అన్నవరం నుంచి భీమవరం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. కేవలం ఎన్నికల కోసం మాత్రమే యాత్ర కాకుండా ప్రజల బాధలను దగ్గరగా తెలుసుకునేందుకు, వారితో మమేకం అయ్యేందుకు ఇదో చరిత్రలో నిలిచిపోయే యాత్ర కాబోతోందని జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, సమస్యలతో సతమతమవుతున్న బాధితులతో ప్రత్యక్షంగా చర్చిస్తూ యాత్ర సాగేలా ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు ప్రజా వినతులు స్వీకరించి, స్థానికులు, రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలతో పవన్ ప్రత్యేకంగా మాట్లాడతారు.


Next Story

Most Viewed