- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుంకీ ఏనుగుల ప్రత్యేకత ఇదే.. పవన్ కల్యాణ్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్య సహకారం చారిత్రాత్మక మైలురాయి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు.

దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్య సహకారం చారిత్రాత్మక మైలురాయి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు. ప్రతిష్టాత్మక విధాన సౌధలో ఆంధ్రప్రదేశ్కు కుంకి ఏనుగులను(Kunki Elephants) అప్పగించడంలో కర్ణాటక ప్రభుత్వం చూపిన సహకారానికి కృతజ్ఞతలు చెప్పారు. ఇది కేవలం పరిపాలనా పరమైన లాంఛనమే కాదు.. సహకార సమాఖ్యవాదానికి నిదర్శనమన్నారు. ఈ శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్లో మానవ-వన్యప్రాణుల సంఘర్షణ ఫలితంగా అడవి ఏనుగుల దాడుల వల్ల కలిగే ప్రాణనష్టాన్ని, పంట నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. మరో ప్రత్యేకత ఏమిటంటే దీని స్ఫూర్తి.. మన రాష్ట్రం ఈ ప్రతిపాదనపై కర్ణాటక ప్రభుత్వం సత్వర ప్రతిస్పందన, రాజకీయాలకు అతీతంగా ఉండడమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు, ఫారెస్ట్ మినిస్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఈ బలమైన స్నేహం మరియు సహకారం రాబోయే సంవత్సరాల్లో కూడా వృద్ధి చెందుతుందని నేను గట్టిగా నమ్ముతున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ రోజు భారతదేశం, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్య సహకారం మరియు ఐక్యత యొక్క శాశ్వత నైతికతకు చారిత్రాత్మక మైలురాయి. ప్రతిష్టాత్మక విధాన సౌధలో ఆంధ్రప్రదేశ్కు కుంకి ఏనుగులను అప్పగించడంలో కర్ణాటక ప్రభుత్వం చూపిన సహకారానిక కృతజ్ఞతలు. ఇది కేవలం పరిపాలనా పరమైన లాంఛనమే కాదు,… https://t.co/sDfq79ltv4
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) May 21, 2025






