- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రంగంలోకి పవన్ కల్యాణ్.. ఉభయ గోదావరి జిల్లాల పర్యటన ఖరారు
దిశ, వెబ్డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేగం పెంచారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు కార్యచరణ సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించాలని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు ఇవాల శనివారం పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన అధికారిక వివరాలు పార్టీ నేతలు వెల్లడించారు. మొత్తం నాలుగు రోజుల పాటు పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగనుంది.
ముందుగా ఈ నెల 14వ తేదీన బీమవరం నియోజకవర్గంలో తొలి సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో పవన్ కల్యాణ్ సభలు ఉండనున్నాయి. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికలకు రెండు నెలల సమయమే ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ సీట్ల సర్దుబాటు మొదలుపెట్టాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర తొలి విడత, రెండో విడత దాదాపు పూర్తి చేశారు. మరోవైపు పార్టీలో చేరికలపై సైతం పవన్ ఫోకస్ చేస్తున్నారు.