- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సోదరుడు లోకేష్కు థాంక్స్’.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు

దిశ,వెబ్డెస్క్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు అని మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. కుంకీ ఏనుగులను తీసుకురావడంపై తనకు అభినందనలు తెలిపిన మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థాంక్స్ చెప్పారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. సోదరుడు నారా లోకేష్కు ధన్యవాదాలు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఈ సమస్యకు ముగింపు పలకాలని ఉద్దేశంతోనే కుంకీ ఏనుగులను తీసుకొచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇది ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించడంతో పాటు.. ఏనుగుల దాడులకు ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నాను అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.






