చంద్రమోహన్‌ను ఎప్పుడు చూసినా ఆ ఫీలింగ్ వచ్చేది: పవన్ కల్యాణ్

by Disha Web Desk 2 |
చంద్రమోహన్‌ను ఎప్పుడు చూసినా ఆ ఫీలింగ్ వచ్చేది: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రమఖ టాలీవుడ్ నటులు చంద్రమోహన్(82) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సినీ హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, ఎన్టీఆర్, మంచు విష్ణు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సీపీఐ నేత రామకృష్ణ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘చంద్రమోహన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. ఆయన్ని తెరమీద చూడగానే ఎంతో పరిచయం ఉన్న బంధువును చూసినట్లు అనిపించేది.

కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేశారు. చంద్రమోహన్ గారితో మా కుటుంబానికి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అన్నయ్య చిరంజీవి గారితో కలిసి చంటబ్బాయి, ఇంటిగుట్టు లాంటి చిత్రాల్లో నటించారు. నా మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో మంచి పాత్ర పోషించారు. తమ్ముడు చిత్రంలో మా ఇద్దరి మధ్య అలరించే సన్నివేశాలు ఉన్నాయి. 900కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులలో అన్ని తరాల వారికి చేరువయ్యారు. శ్రీ చంద్రమోహన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Read More..

చంద్రమోహన్ మృతి.. పలువురు ప్రముఖుల సంతాపం..

Next Story

Most Viewed