పవన్ కల్యాణ్ పిచ్చోడవ్వొచ్చేమో కానీ కాపులు కాదు: మంత్రి అంబటి రాంబాబు

by Disha Web Desk 21 |
పవన్ కల్యాణ్ పిచ్చోడవ్వొచ్చేమో కానీ కాపులు కాదు: మంత్రి అంబటి రాంబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిచ్చోడు కావచ్చు కానీ కాపు సామాజిక వర్గం మాత్రం కాదు అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అవినీతి కేసులో చంద్రబాబును అరెస్టు చేస్తే .. ఏ ప్రతిపక్ష నాయకుడుగానీ, ఏ రాజకీయ నాయకుడు గానీ వెళ్ళలేదు. కానీ ఒకే ఒక్క పవన్ కల్యాణ్ వెళ్ళి, తెలుగుదేశానికి అండగా ఉంటాను, కలిసి పోటీ చేస్తానను అని పిచ్చి పవన్ కల్యాణ్ ఒక్కడే చెప్పాడు అని ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ ఇంత త్యాగం చేస్తే.. ఆయన తెలంగాణలో 8 సీట్లల్లో పోటీ చేస్తే.. పవన్ కల్యాణ్‌ను గెలిపిస్తామని చంద్రబాబు సామాజికి వర్గం వారు అనలేదు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కోసం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ పిచ్చోడు అయితే పిచ్చోడు అవ్వొచ్చేమో గానీ ఆయనను మోస్తున్న ఆ సామాజిక వర్గం వాళ్ళు మాత్రం పిచ్చోళ్ళు కాదు అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ సామాజిక వర్గం వారిని కూకటిపల్లిలో, వేరే స్థానాల్లో ఓడిస్తారా..? ఇక్కడేమో ఆయన సామాజికవర్గం మిమ్మల్ని మోయాలా..? అని నిలదీశారు. ప్రజలు మీకు గుణపాఠం చెబుతారు గుర్తు పెట్టుకోండి అని హెచ్చరించారు. గ్లాసును తుక్కు తుక్కుగా ఓడించడానికి చంద్రబాబు, ఆయన సామాజికవర్గం తెలంగాణలో ప్రయత్నించిందా.. లేదా..? అని నిలదీశారు. ప్రజలేమీ అమాయకులు కాదు. మీరు ఆడినట్టు ఆడటానికి అని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

Next Story