Pawan Kalyan: వారి కుటుంబాలను ఆదుకోండి..

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-09 17:41:46  IST  )

కాకినాడ అంబటి ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారణ వ్యక్తం చేశారు...

Pawan Kalyan: వారి కుటుంబాలను ఆదుకోండి..
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాకినాడ అంబటి ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.మృతుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చెల్లించిన విధంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదని జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

NTR ప్రభుత్వాన్ని పడగొట్టింది వాళ్లే: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

Next Story