మీడియా రంగంలో నూతన వరవడి.. దిశ

by Vemula.Srinu Prasad |

డిజిటల్ మీడియా రంగంలో దిశ తెలుగు దినపత్రిక అగ్రగామిగా నిలిచిందని, ప్రజాభిమానం పొందిందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు...

మీడియా రంగంలో నూతన వరవడి.. దిశ
X

దిశ, బాపట్ల: డిజిటల్ మీడియా రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అగ్రగామిగా నిలిచి, ప్రజాభిమానం పొందిన దిశ తెలుగు దినపత్రిక భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ఆకాంక్షించారు. మార్టూరులోని తన క్యాంపు కార్యాలయంలో క్యాలెండర్ 2026 ఆవిష్కరించారు. ఆవిష్కరణ సందర్భంగా దిశ పాఠకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సమస్యలను వేగవంతంగా ప్రభుత్వానికి చేరవేయడంలో, నిరంతర ప్రజలను సమస్యల పట్ల అప్రమత్తం చేస్తూ మీడియా రంగంలో నూతన వరవడి సృష్టించిన దిశ టీంకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దిశ బాపట్ల జిల్లా ప్రతినిధి ఎన్. నాగార్జున రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story