మరోసారి ధూమ్ ధామ్ గా పల్లె పండగ 2.0

by Muthe.Rajitha |

ఏపీ ప్రభుత్వం మరో అభివృద్ధి పథకానికి రంగం సిద్ధం చేస్తోంది.

మరోసారి ధూమ్ ధామ్ గా పల్లె పండగ 2.0
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం మరో అభివృద్ధి పథకానికి రంగం సిద్ధం చేస్తోంది. గ్రామాల రూపురేఖలు పూర్తిగా మార్చేలా పల్లె పండగ 2.0 ను నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. ఇందుకోసం రూ.6500 కోట్లతో 52 వేల అభివృద్ధి పనులు చేపట్టనుంది. వీటన్నిటినీ సంక్రాంతి లోపు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తోంది. పల్లె పండగ 2.0 కార్యక్రమాన్ని అక్టోబర్ చివర్లో గాని, నవంబర్ మొదటి వారంలో గాని ప్రారంభించే సూచనలు ఉన్నాయి. అయితే గతేడాది పల్లె పండగ కార్యక్రమం పేరుతో రూ.450 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టింది. ఈసారి కూడా రోడ్లు, కాలువలు, గోకులాలతో పాటు 1107 పంచాయితీల్లో మ్యాజిక్ డ్రెయిన్ వంటి పనులు చేపట్టనున్నారు. పల్లె పండగ 2.0 కార్యక్రమంపై సీఎం చంద్రబాబు రేపు లేదా ఎల్లుండి సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది.

Next Story