AP: 28 మంది వీఆర్వోలు, 12 మంది సర్వేయర్లకు నోటీసులు.. కారణం అదే

by Thanuru Gopichand |

ఐవీఆర్​ఎస్​ సర్వేలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రెవెన్యూ అధికారులకు ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు

AP: 28 మంది వీఆర్వోలు, 12 మంది సర్వేయర్లకు నోటీసులు.. కారణం అదే
X

దిశ, గురజాల : ఐవీఆర్​ఎస్​ సర్వేలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రెవెన్యూ అధికారులకు ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. ఏపీలోని పల్నాడు జిల్లా గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో 28 మంది వీఆర్వోలు, 12 మంది విలేజ్ సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు గురజాల ఆర్డీవో మురళీకృష్ణ తెలిపారు. విధి నిర్వహణలో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై ఈ చర్యలు తీసుకున్నామన్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలో వీఆర్వోలు, సర్వేయర్లపై ఫిర్యాదులు రావడంతో చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు.

Next Story