కుప్పం ఘటనపై NHRC సీరియస్.. సీఎస్, డీజీపీకి కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

భర్త చేసిన అప్పులకు భార్యను చెట్టుకట్టేసిన ఘటనపై ఎన్ హెచ్‌ఆర్సీ సీరియస్ అయింది..

కుప్పం ఘటనపై NHRC సీరియస్.. సీఎస్, డీజీపీకి కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: భర్త చేసిన అప్పులకు చిత్తూరు జిల్లా కుప్పంలో భార్యను చెట్టుకట్టేసి చిత్రహింసలకు గురి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనను యావత్తు రాష్ట్రం మొత్తం ఖండించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు సైతం కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఈ ఘటనపై తాజాగా NHRC కూడా సీరియస్ అయింది. అప్పు చెల్లించనందుకు మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనను సుమోటోగా స్వీకరించింది. 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఏపీ సీఎస్, డీజీపీకి NHRC ఆదేశించింది.

Next Story