- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాక్షి టీవీపై NHRC కేసు నమోదు
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) మహిళలపై సాక్షి టీవీలో జరిగిన డిబేట్ వ్యవహారం జాతీయస్థాయిలో తీవ్ర దుమారం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని అమరావతి(Amaravati) మహిళలపై సాక్షి టీవీలో జరిగిన డిబేట్ వ్యవహారం జాతీయస్థాయిలో తీవ్ర దుమారం రేపుతోంది. టీవీ డిబేట్ లో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు(Journalist Kommineni Srinivasa Rao), కృష్ణంరాజులు అమరావతి మహిళలు వేశ్యలు అంటూ, అది వేశ్యల రాజధాని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆంధ్ర రాష్ట్రం భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున సాక్షి టీవీకి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు.
కాగా ఇప్పటికే జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు పోలీసులు. అయితే తాజాగా సాక్షి టీవీపై నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(MP Lavu Srikrishna Devaraya) జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) కు ఫిర్యాదు చేశారు. రాజధానిని ఘోరంగా అవమానించారని, సుమోటోగా ఈ కేసును దర్యాప్తు చేయాలని కోరారు. ఫిర్యాదును పరిశీలించిన హక్కుల కమిషన్ సాక్షి టీవీపై కేసు నమోదు చేసింది.






