వైఎస్ షర్మిల త్వరగా, సంపూర్ణంగా కోలుకోవాలి : సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-26 09:22:27  IST  )

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల త్వరగా, సంపూర్ణంగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

వైఎస్ షర్మిల త్వరగా, సంపూర్ణంగా కోలుకోవాలి : సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల త్వరగా, సంపూర్ణంగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఇటీవలే ఆమెకు ఓ సర్జరీ జరగ్గా.. ఆస్పత్రిలో బెడ్ పై ఉన్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కడుపుకు సంబంధించిన సర్జరీ జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల త్వరగా కోలుకోవాలని, మనోధైర్యంతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా షర్మిల త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. సంపూర్ణ ఆరోగ్యంతో.. త్వరగా ఆమె ప్రజా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు.

Next Story