మంత్రి రోజా ఇన్‌స్టా పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా..

by Disha Web Desk 21 |
మంత్రి రోజా ఇన్‌స్టా పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా..
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి రోజా సెల్వమణి తన ఇన్‌స్టాలో చేసిన పోస్టు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆమె ఈ పోస్టు చేశారు. అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయరంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్న రోజా ఇలాంటి పోస్ట్ పెట్టడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తిరుపతిలో సంధ్యా సమయంలో సూర్యాస్తమయాన్ని చూసి ఈ పోస్టు పెట్టింది రోజా..

పొద్దెక్కిన పొద్దున భానుడి వేల్పు, మళ్ళీ ఎప్పుడు ఉదయిస్థానా ఆ సర్వేశ్వరుడి గిరిపై ఎప్పుడు వాలుతానా అని...జాబిల్లి వేల్పు తిరువేంకటాద్రి గిరిపై వెన్నెల వెలుగు నింపు...

తన్మయత్వంతో అటు సూర్య-చంద్రులు పోటీపడుతున్నట్టు సప్తగిరులు నీదా? నాదా? నువ్వా నేనే అంటున్నవేళ. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యమంగళ స్వరూపాన్ని నోరారా వర్ణించడానికి మాటలు చాలని వేళ తెలుగుతల్లి ముద్దుబిడ్డ అన్నమయ్య అందుకే అన్నాడుకాబోలు `ఏమని పొగడుదునే ఇక నిను... అని, ఓం నమో వేంకటేశాయ!!



Next Story