సీఎం జగన్ ను కలిసిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్

by Dishafeatures2 |
సీఎం జగన్ ను కలిసిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్
X

దిశ, నెల్లూరు సిటీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పొలుబోయిన రూప్ కుమార్ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు రూప్ కుమార్ యాదవ్ పుష్పగుచ్చం అందజేశారు. జగనన్న భవన్ ఏర్పాటుతో పాటు వివిధ రాజకీయ అంశాలకు సంబంధించి సుమారు 15 నిమిషాల పాటు వారు చర్చించారు. నెల్లూరు నగర రాజకీయాల్లో అత్యంత కీలకంగా ఉన్న రూప్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం ఆసక్తిగా మారింది.

Next Story

Most Viewed