- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం చంద్రబాబు డీప్ ఫేక్ వీడియో కలకలం
ఏపీ సీఎం చంద్రబాబు, జర్నలిస్ట్ మూర్తికి సంబంధించిన ఓ ఏఏ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూ.22వేలు పెట్టుబడిగా పెట్టి డబ్బులు సంపాదించండి అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చి సైబర్

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు, జర్నలిస్ట్ మూర్తికి సంబంధించిన ఓ ఏఏ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూ.22వేలు పెట్టుబడిగా పెట్టి డబ్బులు సంపాదించండి అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చి సైబర్ మోసానికి పాల్పడుతున్నారు. కాగా ఈ వీడియోపై మంత్రి లోకేష్ స్పందించారు. జర్నలిస్ట్ మరియు సీఎం చంద్రబాబుపై నకిలీ ఏఐ వీడియో చూసి షాక్ అయ్యానని అన్నారు. ఇది పూర్తిగా మోసం అని ఎవరూ నమ్మవద్దని అన్నారు.
ప్రజలను మోసం చేయడానికి డీప్ ఫేక్ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే నేరస్థులను వదిలిపెట్టబోం అని హెచ్చరించారు. అలాంటి సైబర్ నేరగాళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇలాంటి మోసాల బారిన ప్రజలు పడవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉంటే డీప్ ఫేక్తో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. డీప్ ఫేక్ తో ఈ మధ్య సినిమా తారల వీడియోలను అశ్లీలంగా క్రియేట్ చేయడంతో సైబర్ నేరాలకు పాల్పడుతూ మోసం చేస్తున్నారు.






