Nara Bhuvaneshwari : రైలు ప్రమాదంపై నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి

by Disha Web Desk 21 |
Nara Bhuvaneshwari : రైలు ప్రమాదంపై నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి
X

దిశ, డైనమిక్ బ్యూరో : విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందడంపై నారా భువనేశ్వరి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Next Story

Most Viewed