'వందేమాతరం' 150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం : వైఎస్ జగన్

by Naga Rani Yarlagadda |

మన జాతీయ గీతం "వందేమాతరం"ను రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

వందేమాతరం 150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం : వైఎస్ జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: మన జాతీయ గీతం "వందేమాతరం"ను రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ "150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం" అని తెలిపారు. బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ఈ పవిత్ర గీతం మన స్వాతంత్ర్య సమరయోధుల్లో రగిలించిన ఐక్యతా భావనే మనందరికీ ఆదర్శమని తెలిపారు. ఆ స్ఫూర్తితో మన భావితరాల కోసం, వారి అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

జాతీయగేయం వందేమాతరం దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో రణనినాదంగా ఉపయోగపడింది. 1875 నవంబర్ 7న బంకిం చంద్ర ఛటర్జీ ఈ గేయాన్ని రాయగా.. 1882లో బెంగాలీ నవల ఆనందమఠ్ లో తొలిసారి దీనిని ప్రచురించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వందేమాతరంను జాతీయ గీతంగా ప్రకటించారు.

Next Story