అనంతపురం జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. మారణాయుధాలతో వేటాడి..

by Naga Rani Yarlagadda |

అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

అనంతపురం జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. మారణాయుధాలతో వేటాడి..
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బొమ్మనహాళ్ మండలం కొలగలహళ్లిలో కావలి రమేష్ (50) అలియాస్ సన్నపాములు అనే వ్యక్తి పొలానికి వెళ్తుండగా ప్రత్యర్థులు మారణాయుధాలతో వేటాడారు. వాళ్లదాడిలో రమేష్ కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించాడు. 2022లో జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో రమేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2022లో జరిగిన హత్య నేపథ్యంలోనే కావలి రమేష్ ను చంపినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story