మిస్టర్‌ ఏ2 ఆరోజు దగ్గర పడింది: ఎంపీ రఘురామ

by Web Desk |
మిస్టర్‌ ఏ2 ఆరోజు దగ్గర పడింది: ఎంపీ రఘురామ
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీలోని ఎంపీ, రెబల్‌ ఎంపీ మధ్య ట్విట్టర్‌ వార్‌ కొనసాగుతోంది. ఎంపీలు విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణంరాజు మధ్య ట్వీట్‌, రీట్వీట్‌లతో రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా అంటూ విజయసాయి చేసిన ట్వీట్‌కు ఘాటుగా స్పందించారు రఘురామ. నా జీవితం నీకు, ఏ1కు భారంగా ఉందనే కదా, నన్ను కూడా వివేకానందరెడ్డిలా కడతేర్చాలనుకుంటున్నారు.

ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి సొమ్ములు దోచేస్తున్న మిమ్మల్ని, రొచ్చులో తొక్కే రోజు దగ్గర పడింది.. మిస్టర్‌ ఏ2 అంటూ ఘాటుగా రీట్వీట్‌ చేశారు ఎంపీ రఘురామ. నిన్ను నువ్వే బాడుగకు ఇచ్చుకుని పెయిడ్‌ మైక్‌ అయ్యావు. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్‌మెంట్లు ఏదైనా చేస్తావు. ఇంత నీచపు జీవితం భారంగా లేదా? గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టేశావు కదా అని విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌కు రఘురామ ఈ విధంగా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

https://twitter.com/RaghuRaju_MP/status/1484144027968884740?s=20

Next Story

Most Viewed