బీసీలకు రాజ్యాధికారం NTR పుణ్యమే: MP కేశినేని నాని

by Disha Web Desk 19 |
బీసీలకు రాజ్యాధికారం NTR పుణ్యమే: MP కేశినేని నాని
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, ఎంపీ కేశినేని నాని ఫైర్ అయ్యారు. అధికార వైసీపీకి ఒక గమ్యం, లక్ష్యం లేదని విమర్శించారు. సీఎం జగన్ వ్యక్తిగత అజెండాతోనే పాలన చేస్తున్నారని ఆరోపించారు. విశాఖలో దోపిడి చేసేందుకే రాజధానిని అక్కడికి మారుస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థ రాష్ట్రానికి శాపంలా మారిందని ఫైర్ అయ్యారు. బీసీలకు రాజ్యాధికారం ఎన్టీఆర్ పుణ్యమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు దోపిడీకి పాల్పడటమే పని అని విమర్శించారు. సమ్మిట్‌కు వచ్చిన వారంతా పెట్టుబడులు పెడుతారని కాదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.

Next Story

Most Viewed