- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా అభ్యర్థిని గెలిపించండి: ఎంపీ అవినాశ్ రెడ్డి
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు...

దిశ, వెబ్ డెస్క్: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల(Pulivendula ZPTC elections) ప్రచారాన్ని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రారంభించారు. తమ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి(Former ZPTC Maheshwar Reddy) కుటుంబానికి సీటు కేటాయించామని, వైసీపీ ఎంపీటీసీలు సహకరించాలని కోరారు. ఈ రోజు మహేశ్ కుటుంబం నుంచి రెండు నామినేషన్లు దాఖలు చేసింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు ఎంపీ అవినాశ్ రెడ్డి కీలక పిలుపు నిచ్చారు.
కాగా గత ఎన్నికల్లో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గెలుపొందారు. అయితే ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఈ స్థానాన్ని భర్తీ చేస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించింది. ఆగస్టు 1 సాయంత్రం వరకూ ఈ నామినేషన్లను స్వీకరించనుంది. 5వ తేదీ మధ్యాహ్నం 3లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు విధించింది. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల ఫైనల్ లిస్టు విడుదల చేయనుంది. 12న పోలింగ్ నిర్వహించనుంది. 14న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితం వెల్లడించనుంది.






