దొంగ ఓట్ల కామెంట్స్‌పై ఎమ్మెల్యే రాపాక క్లారిటీ

by Disha Web Desk 19 |
దొంగ ఓట్ల కామెంట్స్‌పై ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తాను దొంగ ఓట్లతోనే గెలిచానని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దూమారం రేపాయి. దీంతో దొంగ ఓట్ల కామెంట్స్‌పై ఎట్టకేలకు రాపాక వివరణ ఇచ్చారు. తాను దొంగ ఓట్ల గురించి మాట్లాడింది గత ఎన్నికలకు సంబంధించి కాదని.. 32 ఏళ్ల క్రితం నాటి ఘటనను గుర్తు చేశానని క్లారిటీ ఇచ్చారు. అప్పటి సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఘటన గురించి మాత్రమే మాట్లాడానని తెలిపారు. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు నాకు పడలేదని చెప్పారు. దొంగ ఓట్ల గురించి తాను ఆత్మీయ సమ్మేళనంలో చేసిన వ్యాఖ్యలు కేవలం సరదా కోసమేనని వివరణ ఇచ్చారు. టీడీపీపై విమర్శలు చేస్తే.. జనసేనికులు ఆందోళన చేపట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు.



Next Story

Most Viewed