- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ హయాంలో ఆలయాలపై ఎన్ని దాడులు జరిగినా పట్టించుకోలేదు.. మంత్రి వాసంశెట్టి ఫైర్
ద్రాక్షారామం శివలింగం ధ్వంసం ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. శివలింగం ధ్వంసం చేయడం విషాదకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ద్రాక్షారామం శివలింగం ధ్వంసం ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. శివలింగం ధ్వంసం చేయడం విషాదకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ అనే వ్యక్తి గునపం, రాడ్డులతో శివలింగాన్ని విచ్చిన్నం చేశాడని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సమర్థవంతంగా విచారణ చేపట్టి వెంటనే నిందితుడిని గుర్తించారని అన్నారు. వైసీపీ హయాంలో ఆలయాలపై ఎన్ని దాడులు జరిగినా ప్రభుత్వం మొక్కుబడిగా వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. అంతర్వేదిలో రథానికి మంట అంటుకుంటే నిందితులను పట్టుకోకుండా చివరికి ఓ వ్యక్తిని చూపించి ఉన్మాది అన్నారని చెప్పారు. కృష్ణాజిల్లాలో ఆంజనేయ విగ్రహం విచ్చిన్నం చేసినప్పుడు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడారని అన్నారు. కానీ ఈ ప్రభుత్వం అలాంటిది కాదన్నారు. 8గంటలు సమయం ఇస్తే పోలీసులు ఆరు గంటల్లోనే నిందితున్ని పట్టుకున్నారని వ్యాఖ్యానించారు. వైసీసీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని విమర్శించారు.






