- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు మంత్రి లోకేష్ అభినందనలు
బీహార్ బీజేపీ ఎన్నికల ప్రచారకర్త ధర్మేంద్ర ప్రధాన్తో మంత్రి నారా లోకేష్ పాట్నాలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు...

X
పాట్నా (బీహార్): కేంద్ర విద్యాశాఖ మంత్రి, బీహార్ బీజేపీ ఎన్నికల ప్రచారకర్త ధర్మేంద్ర ప్రధాన్తో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాట్నాలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బీహార్లో ఎన్డీఏ విజయం కోసం ప్రధాన్ అహరహం శ్రమిస్తున్నారు. గతేడాది హర్యానా, ఒడిశా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయంలో ప్రధాన్ కీలక పాత్ర వహించారు. ఇప్పుడు బీహార్ లో ఎన్ డీఏ విజయం కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు. బీహార్ లో మరోమారు ఎన్ డీఏ సర్కారును గెలిపించేందుకు ప్రధాన్ చేస్తున్న నిర్మాణాత్మక కృషిని మంత్రి లోకేష్ అభినందించారు. బీహార్ లో మరోమారు ఎన్ డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాగలదన్న నమ్మకాన్ని లోకేష్ వ్యక్తంచేశారు. మంత్రి లోకేష్ వెంట ఎంపీలు సానా సతీష్, గంటి హరీష్, కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు.
READ MORE .....
Next Story






