కాశీబుగ్గ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి లోకేశ్.. ప్రమాదంపై ఆరా

by Vemula.Srinu Prasad |

కాశీబుగ్గ వద్ద జరిగిన తొక్కిసలాట ప్రాంతాన్ని మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. ..

కాశీబుగ్గ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి లోకేశ్.. ప్రమాదంపై ఆరా
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి(Kasibugga Venkateshswamy) ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ప్రాంతాన్ని మంత్రి నారా లోకేశ్(Minister Nara lokesh) పరిశీలించారు. తొక్కిసలాట జరిగిన తీరుపై ఆరా తీశారు. ఘటనలో ఎంత మంది మృతి చెందారు.. గాయాలయిన వారెంత మందనేది అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలు, క్షతగాత్రుల వివరాలు సైతం తెలుసుకున్నారు. భక్తులు భారీగా తరలివస్తే తమకు సమాచారం అందిందాలేదా అని ప్రశ్నించారు. గుడి యాజమాన్యం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసు అధికారులు తెలిపారు. ఘటన జరగడం చాలా బాధాకరమని, చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు మంత్రి లోకేశ్ సూచించారు.

Next Story