టీమిండియా విజయంపై మంత్రి నారా లోకేశ్ హర్షం

by Naga Rani Yarlagadda |

విశాఖ వేదికగా సౌతాఫ్రికాపై టీమిండియా సాధించిన ఘన విజయంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

టీమిండియా విజయంపై మంత్రి నారా లోకేశ్ హర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ వేదికగా సౌతాఫ్రికాపై టీమిండియా సాధించిన ఘన విజయంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా భారత క్రికెట్ జట్టును అభినందించారు. వైజాగ్ లో ఇదొక అద్భుతమైన క్రికెట్ అని, రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ చాలా బాగా ఆడారని, యశస్వి జైస్వాల్ అజేయంగా 116 పరుగులు చేయడం ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. ఆంధ్రప్రదశ్ క్రికెట్ అభిమానులు ఇంతకన్నా ఎక్కువ కోరుకోలేరని పేర్కొన్నారు. కాగా.. విశాఖలో జరిగిన మూడవ వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.

Next Story