ఆ వేడుకకు జగన్‌ను ఆహ్వానిస్తాం: మంత్రి లోకేశ్

by Vemula.Srinu Prasad |

ఆ వేడుకకు జగన్‌ను ఆహ్వానిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు..

ఆ వేడుకకు జగన్‌ను ఆహ్వానిస్తాం: మంత్రి లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం(Kutami Government) అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ(Mega Dsc) నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ పరీక్షల్లో 16000 మంది ఉపాధ్యాయులు(Teachers)గా ఉత్తీర్ణులయ్యారు. దీంతో వారందరికి నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy)ని ఆహ్వానించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) క్లారిటీ ఇచ్చారు. DSC ద్వారా ఎంపికైన 16000 ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందజేస్తామని తెలిపారు. ఈ వేడుకకు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్(Pulivendula MLA) కూడా ఆహ్వానిస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

Next Story