Breaking: దమ్ముంటే రా.. అచ్చెన్నాయుడుకు మంత్రి జోగు రమేశ్ సవాల్

by Disha Web Desk 16 |
Breaking: దమ్ముంటే రా.. అచ్చెన్నాయుడుకు మంత్రి జోగు రమేశ్ సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్‌ను మంత్రి జోగు రమేశ్ స్వీకరించారు. తమరు ఎంచుకున్న గ్రామంలో చాలెంజ్‌కు రెడీనా అని ప్రతి సవాల్ విసిరారు. వైసీపీ మేనిఫెస్ట్‌పై అచ్చెన్నాయుడు చేసిన విమర్శలపై మంత్రి జోగు రమేశ్ స్పందించారు. టైమ్, డేట్ చెప్పాలని, ఏ రోజు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పారు. దమ్ము, ధైర్యం ఉంటే తన ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. వైసీపీ మేనిఫెస్టో‌పై అచ్చెన్నాయుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. అసలు టీడీపీ పార్టీ లేదన్న వ్యక్తి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.

టీడీపీ హయాంలో ఏం జరిగిందో.. నాలుగేళ్ల తమ పాలనలో ఏం మేలు జరిగిందో చర్చిద్దామని మంత్రి జోగు రమేశ్ పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు మీ స్వాతిముత్యాన్ని వెంటపెట్టుకుని అసెంబ్లీ రా అని జోగు రమేశ్ సూచించారు. తమరు మేనిఫెస్టో గురించి మాల్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో ఇచ్చిన హామీలన్ని అమలు చేసి ప్రజల దగ్గరకు వెళ్తున్న పార్టీ వైసీపీ అని మంత్రి జోగు రమేశ్ వ్యాఖ్యానించారు.



Next Story

Most Viewed