- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చంద్రబాబు ఉన్నది వెల్ నెస్ సెంటర్లో కాదు సెంట్రల్ జైల్లో: మంత్రి అమర్నాథ్ కౌంటర్
దిశ, వెబ్డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైలులో తీవ్ర ఉక్కపోత కారణంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు అస్వస్థతకు గురయ్యారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో తీవ్ర ఉక్కపోత కారణంగా చంద్రబాబు డీహైడ్రేషన్కు గురయ్యారు. దీనిపై జైలు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ములాఖత్లో భాగంగా చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలిపారు. కాగా, జైలులో చంద్రబాబు అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అస్వస్థతకు గురైనట్లు చెప్పి చంద్రబాబు సింపతీ కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఉంటోంది వెల్ నెస్ సెంటర్లో కాదు.. సెంట్రల్ జైల్లో అన్న విషయం గుర్తు పెట్టుకోండని సూచించారు. నేరం చేసినవాళ్లను ఉంచేందుకు జైళ్లను పెట్టారని.. డీహైడ్రేషన్ అయిన, దోమలు కుట్టినా జైల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని కౌంటర్ ఇచ్చారు. ఇక, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అవినీతికి జైలు శిక్ష పడటం ఖాయమని అన్నారు.