విద్యుత్​శాఖపై జగన్​రూ.1.25 లక్షల కోట్ల అప్పు : మంత్రి గొట్టిపాటి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-08 05:44:11  IST  )

యాక్సిస్​రెన్యూవబుల్​ఎనర్జీ బ్రూక్​షీల్డ్‌తో చేసుకున్న ఒప్పందంతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం పీక్​అవర్స్‌లో విద్యుత్‌ను రూ.9.38కి కొనుగోలు చేసిందన్నారు.

విద్యుత్​శాఖపై జగన్​రూ.1.25 లక్షల కోట్ల అప్పు : మంత్రి గొట్టిపాటి
X

దిశ, డైనమిక్​బ్యూరో/ వెబ్‌డెస్క్: రాష్ట్ర బాగు కోసం జగన్‌‌కు మనసు రావడం లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్​అన్నారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ సొంత మీడియా ద్వారా జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. యాక్సిస్​రెన్యూవబుల్​ఎనర్జీ బ్రూక్​షీల్డ్‌తో చేసుకున్న ఒప్పందంతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం పీక్​అవర్స్‌లో విద్యుత్‌ను రూ.9.38కి కొనుగోలు చేసిందన్నారు. అదే పీక్​అవర్స్‌లోనూ రూ.4.60కే తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. జగన్​ప్రభుత్వం యూనిట్ విద్యుత్‌ను రూ.5.12కు కొనుగోలు చేసుకుందన్నారు. సెకీ నుంచి రూ.2.49కే ప్రభుత్వం కొనుగోలు చేసిందనేది అవాస్తవమన్నారు. అన్ని ఖర్చులు కలిపి వైసీపీ హయాంలో యూనిట్ విద్యుత్​రూ.5కు కొన్నారని తెలిపారు. యాక్సిస్​బ్రూక్‌షీల్డ్​సంస్థ రైతుల నుంచి రూ.1,700 ఎకరాలు లీజు తీసుకుందన్నారు. రైతులకు ఎకరాకు రూ.31 వేలు ఫీజు చెల్లించేలా ఒప్పందం జరిగిందన్నారు. ప్రతి రెండేళ్లకు లీజును 5 శాతం పెంచేలా ఒప్పందం కుదిరిందని తెలిపారు. విద్యుత్​శాఖపై రూ.1.25 లక్షల కోట్ల అప్పు చేసిన జగన్ ఆ శాఖను నాశనం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం పెంచిన ఛార్జీలను ఇప్పటికీ ప్రజలు చెల్లించాల్సి వస్తుందన్నారు. కాగా.. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా 9 ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కు ఏపీ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు.

Next Story